BUILDING : నేటికీ పూర్తికాని సచివాలయ భవనాలు
ABN , Publish Date - May 19 , 2024 | 12:04 AM
మండలంలోని పలు గ్రామ సచివాలయ భవన నిర్మాణాలు పూర్తికాలేదు. ఇంకా వివిధ దశల్లో ఉన్నాయి. మండల కేంద్రంలోని సచివాలయ భవన నిర్మాణం అసంపూర్తిగా దర్శనమిస్తోంది. ఒక్కొక్క సచివాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.45లక్షలు విడుదల చేసింది. మొదటి విడతలో నిధులు విడుదల కావడంతో ఎంతో ఉత్సాహంగా పనులు చేపట్టా రు. రెండో వి డతలో నిధులు రాకపోవడంతో పాలు భవనాల నిర్మాణం లింటిల్, రూఫ్ లెవెల్ వరకు నిర్మించి వదిలి వేశారు.
రొళ్ల, మే 18: మండలంలోని పలు గ్రామ సచివాలయ భవన నిర్మాణాలు పూర్తికాలేదు. ఇంకా వివిధ దశల్లో ఉన్నాయి. మండల కేంద్రంలోని సచివాలయ భవన నిర్మాణం అసంపూర్తిగా దర్శనమిస్తోంది. ఒక్కొక్క సచివాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.45లక్షలు విడుదల చేసింది. మొదటి విడతలో నిధులు విడుదల కావడంతో ఎంతో ఉత్సాహంగా పనులు చేపట్టా రు. రెండో వి డతలో నిధులు రాకపోవడంతో పాలు భవనాల నిర్మాణం లింటిల్, రూఫ్ లెవెల్ వరకు నిర్మించి వదిలి వేశారు. మల్లినమడుగులో సచివాలయ భవనం టాప్ లెవెల్ వరకు చేపట్టారు. ఎం రాయాపురం, రొళ్ల సచివాలయాల నిర్మాణాలు నిలి చిపోయాయి. దీంతో ఆయా గ్రామాల్లో భవనాలను అద్దెకు తీసుకొని అందులో విధులు నిర్వహిస్తున్నారు. ఏది ఏమైనా భవనాలను త్వరగా పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు అధికారులను కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....