Share News

టీడీపీని గెలిపిస్తేనే రాష్ట్రానికి మనుగడ

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:21 AM

తెలుగు దేశం పార్టీని గెలిపించు కుంటే నే రాష్ట్రానికి మనుగడ సాధ్యమ వుతుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సునీల్‌కుమార్‌ పేర్కొన్నారు.

టీడీపీని గెలిపిస్తేనే రాష్ట్రానికి మనుగడ
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సునీల్‌కుమార్‌

మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సునీల్‌కుమార్‌

రొళ్ల, ఏప్రిల్‌ 18: తెలుగు దేశం పార్టీని గెలిపించు కుంటే నే రాష్ట్రానికి మనుగడ సాధ్యమ వుతుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సునీల్‌కుమార్‌ పేర్కొన్నారు. మండలం లోని వన్నారనపల్లిలో ఎన్నికల ప్రచా ర కార్యక్రమానికి వచ్చిన సునీల్‌కుమార్‌కు యువకులు డప్పు వాయిద్యాలతో, మహిళ లు హారతులతో ఘన స్వాగతం పలికారు. మహిళలు నృత్యం చేస్తూ ఆనం దాన్ని వ్యక్తం చేశారు. ఈసందర్భంగా సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ... నాయకులు, కార్యకర్తలు, మహిళలు టీడీపీకి ఓట్లు వేసి ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు అఖండ విజయం చేకూర్చాలని గ్రామస్థులను అభ్యర్థించారు. ఇంటింటికీ బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, సూపర్‌సిక్స్‌ పథకాలను వివరిస్తూ... సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయ డమే తమ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వక్కలిగ సాధికార కన్వీనర్‌ వీఎం పాండురంగప్ప, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, జిల్లా కార్యదర్శి రవిభూషణ్‌, ఐటీడీపీ జగదీష్‌, సీనియర్‌ నాయకులు రంగారెడ్డి, సాదరి నరసప్ప, మూర్తి, నారాయణ, తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:21 AM