Share News

POLICE: టీడీపీ శ్రేణులను చెదరగొట్టిన పోలీసులు

ABN , Publish Date - Jun 04 , 2024 | 11:36 PM

కౌంటింగ్‌ ప్రారంభం అయిన కొద్ది సమయంలోనే మండల కేంద్రంలో టీడీపీ నాయకులు 11గంటలకే స్థానిక బస్టాండ్‌ ప్రాంతానికి చేరుకున్నారు. టీడీపీ కూటమి 137స్థానాల్లో ముందంజలో ఉందని తెలియటంతో మిఠాయిలు పంపిణీ చేస్తూ బాణా సంచాలు కాల్చే ప్రయత్నాలు చేశారు.

POLICE: టీడీపీ శ్రేణులను చెదరగొట్టిన పోలీసులు
టీడీపీ శ్రేణులను తరుముతున్న పోలీసులు

విడపనకల్లు, జూన 4: కౌంటింగ్‌ ప్రారంభం అయిన కొద్ది సమయంలోనే మండల కేంద్రంలో టీడీపీ నాయకులు 11గంటలకే స్థానిక బస్టాండ్‌ ప్రాంతానికి చేరుకున్నారు. టీడీపీ కూటమి 137స్థానాల్లో ముందంజలో ఉందని తెలియటంతో మిఠాయిలు పంపిణీ చేస్తూ బాణా సంచాలు కాల్చే ప్రయత్నాలు చేశారు. దీన్ని గమనించిన పోలీసులు లాఠీలతో టీడీపీ నాయకులను చెదరగొట్టారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఎవ్వరు రోడ్లుపైకి రాకూడదు అంటూ తరిమారు. గుంతకల్లు డీఎస్పీ భాస్కర్‌రెడ్డి, ఉరవకొండ సీఐ ప్రవీణ్‌కుమార్‌, విడపనకల్లు ఎస్‌ఐ ఖాజాహుస్సేన, ప్రత్యేక పోలీస్‌ సిబ్బందితో బందో బస్తు నిర్వహించారు.

Updated Date - Jun 04 , 2024 | 11:36 PM