crime: సెల్టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:51 AM
ముదిగుబ్బ, ఏప్రిల్ 27: మండలంలోని మలకవేముల క్రాస్లో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్టవర్ ఎక్కి హల్చల్ చేసినట్లు పట్నం పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు.. మలకవేముల క్రాస్లో సమీప ఇళ్లల్లోని వారు ఒకరికొకరు తరచూ గొడవలు పడేవారు. కాగా శనివారం ఉదయం నాగరాజు నాయక్ అనే వ్యక్తికి పక్కింటి వాళ్లతో గొడవ జరిగింది. ఈ క్రమంలో పక్కింటి వాళ్లు పోలీ్సస్టేషనలో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు.
![crime: సెల్టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్](https://media.andhrajyothy.com/media/2024/20240413/27_MGB_3_A_af37ef7909.jpg)
ముదిగుబ్బ, ఏప్రిల్ 27: మండలంలోని మలకవేముల క్రాస్లో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్టవర్ ఎక్కి హల్చల్ చేసినట్లు పట్నం పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు.. మలకవేముల క్రాస్లో సమీప ఇళ్లల్లోని వారు ఒకరికొకరు తరచూ గొడవలు పడేవారు. కాగా శనివారం ఉదయం నాగరాజు నాయక్ అనే వ్యక్తికి పక్కింటి వాళ్లతో గొడవ జరిగింది. ఈ క్రమంలో పక్కింటి వాళ్లు పోలీ్సస్టేషనలో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు.
విషయం తెలుసుకున్న అతను సమీపంలోని సెల్టవర్ ఎక్కి తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నాగరాజు నాయక్ను కిందకి దించారు. అనంతరం ఇరువురికీ సర్ది చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం...