జగన ఓటమే కూటమి లక్ష్యం
ABN , Publish Date - Apr 04 , 2024 | 12:08 AM
సీఎం జగనను గద్దెదించడమే కూటమి లక్ష్యమని అనంతపురం అర్బన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు.
![జగన ఓటమే కూటమి లక్ష్యం](https://media.andhrajyothy.com/media/2024/20240326/_2631f736c8.jpg)
అనంతపురం అర్బన, ఏప్రిల్ 3: సీఎం జగనను గద్దెదించడమే కూటమి లక్ష్యమని అనంతపురం అర్బన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక శ్రీనగర్ కాలనీలో అనంత అర్బన టీడీపీ కార్యాలయం వద్ద అనంతపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తనతోపాటు ఎంపీ అభ్యర్థి జిల్లా వాసులమేనన్నారు. రాప్తాడు ఎంపీపీగా నేషనల్ స్థాయిలో తాను ఉత్తమ అవార్డు పొందానన్నారు. అధికారంలోకి రాగానే అనంత అర్బనను దేశంలోనే ప్రథమ స్థాయిలో నిలుపుతా నన్నారు. తమ టీడీపీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలున్నాయని, అందరినీ కలుపుకొని టీడీపీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళతానని అన్నారు. అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. ఎమ్మె ల్యే, ఎంపీ అభ్యర్థులు నానలోకల్ అంటూ కొందరు అసత్యప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు మాట్లాడుతూ... సీఎం జగన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి తీరని అన్యాయం జరిగిందన్నారు. జనసేన రాయసీమ మహిళా విభాగం కో - ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ... ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఎక్కడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ స్వరూప, అనంత అర్బన బ్యాంక్ చైర్మన జేఎల్ మురళీధర్, టీడీపీ రాష్ట్ర నాయకులు బుగ్గయ్యచౌదరి, గాజుల ఆదెన్న, కాపు కార్పొరేషన మాజీ చైర్మన రాయల్ మురళీ, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి దళవాయి వెంకట నారాయణ, బీసీ సెల్ నగర అధ్యక్షుడు సిమెంట్ పోలన్న, నాయకులు సుధాకర్ నాయుడు, మాసినేని రామయ్య, లింగారెడ్డి, సంగా తేజస్విని, గుత్తా ధనుంజయనాయుడు, మారుతీ నాయుడు, వెంకటప్ప, బీజేపీ నాయకులు లలితకుమార్ తదితరులు పాల్గొన్నారు.