కూటమి గెలుపే లక్ష్యం
ABN , Publish Date - Mar 29 , 2024 | 12:45 AM
పుట్టపర్తి/బుక్కపట్నం, మార్చి 28: రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం కావాలని, ఇందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా కృషి చేసి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు.
- కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి -మాజీ మంత్రి పల్లె పిలుపు
పుట్టపర్తి/బుక్కపట్నం, మార్చి 28: రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం కావాలని, ఇందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా కృషి చేసి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని ప్రశాంతిగ్రామంలో గల తన నివాసంలో గురువారం ఆయన బుక్కపట్నం మండలం కృష్ణాపురం, యాదాలంకపల్లి, మారాల గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. చంద్రబాబు ప్రకటించిన మినీమేనిఫెస్టో పథకాలకు ఆదరణ పెరుగుతోందన్నారు. వీటిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యంగా ఎన్నికల్లో బూతస్థాయి యూనిట్, క్లస్టర్ ఇనచార్జిలు అత్యంత కీలకమన్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ వారు అనేక కుట్రలకు తెరలేపుతారని, వాటిని ఎప్పటికప్పుడు పసిగట్టి తిప్పికొట్టాలని తెలిపారు. భవిష్యత్తు బాగాండాలంటే చం ద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నియోజకవర్గంలో పల్లె సింధూరారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో మండల కన్వీనర్ చింతామల్లిరెడ్డి, నాయకులు గోపాలపురం గంగాధర్, పల్లపురవి, లింగప్పగారిపల్లి రవి, ఉత్తప్ప, బెస్తచలపతి, నారాయణస్వామి, రెడ్డెప్ప, కిష్టప్ప, ఆంజనేయు లు, హరి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.