టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు
ABN , Publish Date - Mar 12 , 2024 | 11:48 PM
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా చంద్ర బాబు బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీ డీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్కుమార్ అన్నారు.
![టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు](https://media.andhrajyothy.com/media/2024/20240306/12mdk3_a0f9b8aaca.jpg)
ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్కుమార్
మడకశిరటౌన, మార్చి 12: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా చంద్ర బాబు బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీ డీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్కుమార్ అన్నారు. అప్పుడే రాష్ట్రానికి భవిష్యత్తు అన్నారు. పట్టణంలోని మిట్టబండ ఆంజనేయస్వామి ఆలయం సమీ పంలో ఉన్న కమ్యూనిటీ భవనంలో మంగళవారం టీడీపీ బూత కన్వీనర్లతో బా బు ష్యూరిటీ భవిషత్తుకు గ్యారంటీ, సూపర్ సిక్స్ పథకాల కిట్లను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన తక్షణమే సూపర్ సిక్స్ పథకాలను, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ తదితర కార్యక్రమాలను అమలు చేస్తారని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఆవశ్యక తను వివరించాలన్నారు. ఈపథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొం దించాలని, బూత కన్వీనర్లకు, నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.