The culprits should be punished severely దోషులను కఠినంగా శిక్షించాలి
ABN , Publish Date - Aug 24 , 2024 | 01:25 AM
కలకతాలోని జూనియర్ వైద్యురాలిని అత్యాచారం, హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆర్డీటీ ఏటీఎల్ శ్రీనివా్సరెడ్డి, బొమ్మనహాళ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మోహనకుమార్, వైద్యాధికారి మల్లేశ్వరి డిమాండ్ చేశారు.
బొమ్మనహాళ్, ఆగస్టు 23 : కలకతాలోని జూనియర్ వైద్యురాలిని అత్యాచారం, హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆర్డీటీ ఏటీఎల్ శ్రీనివా్సరెడ్డి, బొమ్మనహాళ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మోహనకుమార్, వైద్యాధికారి మల్లేశ్వరి డిమాండ్ చేశారు.
మండల కేంద్రంలో శుక్రవారం వారు విద్యార్థులతో కలిసి ఈమేరకు ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధుల్లో ర్యాలీ చేపట్టి అనంతరం బళ్లారి - కళ్యాణదుర్గం రహదారిపై మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు దోషులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు హనుమంతనాయక్, సుబ్బరాయుడు, హెల్త్ అసిస్టెంట్లు గోవర్ధన, జైనబీ, ఆర్డీటీ సిబ్బంది చంద్ర తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..