chialakam madhu: కూటమి విజయం సాధించాలి
ABN , Publish Date - May 24 , 2024 | 12:06 AM
రాష్ట్రంలో కూటమి విజయం సాధించాలని, అదే వి ధంగా పిఠాపురంలో జనసేన అధినేత పవనకల్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని కోరుతూ జనసేన రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి యాగాలు, హోమాలు నిర్వహించారు.
![chialakam madhu: కూటమి విజయం సాధించాలి](https://media.andhrajyothy.com/media/2024/20240511/23_DMV_5_b5b4e63838.jpg)
-హోమాలు నిర్వహించిన జనసేన నేత చిలకం మధు
ధర్మవరం, మే 23: రాష్ట్రంలో కూటమి విజయం సాధించాలని, అదే వి ధంగా పిఠాపురంలో జనసేన అధినేత పవనకల్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని కోరుతూ జనసేన రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి యాగాలు, హోమాలు నిర్వహించారు.
పట్టణంలోని పార్టీ నూతన కార్యాలయంలో గురువారం ఆయన సతీమణి ఛాయాదేవితో కలిసి రాజశ్యామల యాగం, శ్రీశత చండీహోమం, సుదర్శన హోమం, గణపతిహోమం తో పాటు పూర్ణహారతి తదితర పూజలను నిర్వహించారు. అనంతరం మా ట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి విజయం సాధించాలని, పవనకల్యాణ్ అత్యధిక మెజారీటీతో గెలుపొందాలని ఈ హోమాలు చేస్తున్నామన్నారు. వర్షాలు సకాలంలో కురిసి పంటలు సంవృద్ధిగా పండి ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని కూడా ఈపూజలను ఐదు రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..