road accident బైక్ అదుపుతప్పి ఇద్దరికి గాయాలు
ABN , Publish Date - Sep 17 , 2024 | 12:23 AM
మండలంలోని కరిడికొండ గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
గుత్తిరూరల్, సెప్టెంబరు 16: మండలంలోని కరిడికొండ గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
కె.ఊబిచెర్ల గ్రామానికి చెందిన హనుమేష్, వెంకటరాముడు గుత్తికి బైక్లో వెళ్లి కొద్దిసేపటి అనంతరం తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. కరిడికొండ గ్రామాశివారులోకి రాగానే బైక్ అదుపు తప్పి బోల్తా పడిం ది. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..