Share News

టీడీపీలోకి పది కుటుంబాలు చేరిక

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:38 AM

కదిరి, ఫిబ్రవరి 26: అమడగూరు మండలం సోలకుంటపల్లికి చెందిన పది కుటుంబాల వారు సోమవారం వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. జిల్లాకేంద్రమైన పుట్టపర్తిలోని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి నివాసంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

 టీడీపీలోకి  పది కుటుంబాలు చేరిక

కదిరి, ఫిబ్రవరి 26: అమడగూరు మండలం సోలకుంటపల్లికి చెందిన పది కుటుంబాల వారు సోమవారం వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. జిల్లాకేంద్రమైన పుట్టపర్తిలోని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి నివాసంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పల్లెతో పాటు నియోజవకర్గ పరిశీలకుడు బచ్చలపుల్లయ్య వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పల్లె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి సైనికుల్లా కృషి చేయాలని సూచించారు. పార్టీలోకి చేరిన వారిలో శ్రీనివాసులు, రవి, అంజి, మణికుమార్‌, మారుతి, శ్రీకాంత, నారాయణప్ప, సాయినాథ్‌రెడ్డి, ఈశ్వరప్ప, షబ్బీర్‌అహమ్మద్‌ తదితరులు ఉన్నారు. నాయకులు మామిడిమేకలపల్లి ఆదినారాయణరెడ్డి, కంచెరవాండ్లపల్లి క్రిష్టప్ప ఆధ్వర్యంలో వారు పార్టీలోకి చేరారు.

Updated Date - Feb 27 , 2024 | 12:38 AM