తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర భవిష్యత్తు
ABN , Publish Date - Mar 04 , 2024 | 12:25 AM
తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర భవిష్యత్తు అని తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు ఎంహెచ లక్ష్మీనారాయణరెడ్డి అన్నారు.
పామిడి, మార్చి 3: తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర భవిష్యత్తు అని తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు ఎంహెచ లక్ష్మీనారాయణరెడ్డి అన్నారు. పట్టణంలోని ఎద్దులపల్లిరోడ్డులో ఉన్న తన నివాసంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని క్లస్టర్, యూనిట్, బూత లెవల్ ఇనచార్జిలు ప్రతి ఇంటికి వెళ్లి బాబు సూపర్ సిక్స్ క్యాలెండర్లు అందజేయాలన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన గౌస్పీరా, మాజీ కౌన్సిలర్ చెన్నవరం మహబూబ్బాషా, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి శివశంకర్, టీడీపీ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, వడ్డే శివకుమార్, బొమ్మా మోహన కృష్ణ, జనసేన మండల అధ్యక్షుడు ధనుంజయ, టీడీపీ నాయకులు గాదిలింగ, పట్రా శ్రీనివాసులు, రంగస్వామియాదవ్, దశరథ, సాయి, జిలాన, రాజు, శివ పాల్గొన్నారు.
కళ్యాణదుర్గంరూరల్: టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని జనసేన నాయకులు లక్ష్మీపతి అన్నారు. ఆదివారం ఆయన అపిలేపల్లి, కుందుర్పి, తిప్పనపల్లి తదితర గ్రామాలలో పర్యటించి టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయా గ్రామాల్లో జనసేన నాయకులను, బలిజ కులస్తులను కలిసి ఉమ్మడి అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. సంజీవరాయుడు, జీ మురళీకృష్ణ, పేరూరు శ్రీనివాసులు, దివాకర్, ఈరణ్ణ, నరసయ్య, రమణకట్ట రాజు తదితరులు పాల్గొన్నారు.