అధికారంలోకి వచ్చేది టీడీపీనే..!
ABN , Publish Date - Apr 18 , 2024 | 11:33 PM
‘ఎవరూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు... వచ్చేది తెలుగుదేశం కూటమి ప్రభుత్వమేనని.. జూన 9న చంద్రబాబునాయుడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. రాసి పెట్టుకోండి.. ’ అని అనంతపురం అర్బన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు
అనంతపురం అర్బన, ఏప్రిల్ 18: ‘ఎవరూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు... వచ్చేది తెలుగుదేశం కూటమి ప్రభుత్వమేనని.. జూన 9న చంద్రబాబునాయుడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. రాసి పెట్టుకోండి.. ’ అని అనంతపురం అర్బన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం స్థానిక ఒకటో డివిజన పరిధిలోని ఎర్రనేల కొట్టాల, రెవెన్యూ కాలనీ, లెక్చరల్స్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముస్లిం మైనార్టీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దగ్గుబాటి ప్రసాద్కు ఘన స్వాగతం పలికారు. తాము అధికారంలోకి రాగానే డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని దుగ్గుబాటి హామీ ఇచ్చారు. అనంత అర్బనలో మైనార్టీల సంపూర్ణ మద్దతు టీడీపీకి ఉందని, ఆ వర్గాలకు ఎల్లప్పుడు అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ స్వరూప, నాయకులు జేఎల్ మురళీధర్, బుగ్గయ్య చౌదరి, మారుతీకుమార్ గౌడ్, ముక్తియార్, కూచి హరి, దళవాయి వెంకటనారాయణ, సైఫుద్దీన, రాయల్ మురళీ, దేవళ్ల మురళీ, చంద్రమౌళి, నెట్టెం బాలకృష్ణ, గోపాల్ గౌడ్, రాజారావు, ఉమర్, వన్నూరప్ప, రఫి,మణికంఠ బాబు, కడియాల కొండన్న, కృష్ణకుమార్, సంగా తేజస్విని, వడ్డే భవాని, ఇమ్రాన, చాంద్ బాషా, షేక్షా పాల్గొన్నారు.