Share News

దుర్గంలో టీడీపీ అత్యధిక మెజార్టీతో గెలవాలి

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:12 AM

కళ్యాణదుర్గం టీడీపీ కంచుకోటలో అత్యధిక మెజార్టీతో విజయకేతనం ఎగురవేయాలని అ ధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మె ల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు సూచించారు.

దుర్గంలో టీడీపీ అత్యధిక మెజార్టీతో గెలవాలి
చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు

అమిలినేనికి సూచించిన చంద్రబాబు

కళ్యాణదుర్గం, మార్చి 28: కళ్యాణదుర్గం టీడీపీ కంచుకోటలో అత్యధిక మెజార్టీతో విజయకేతనం ఎగురవేయాలని అ ధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మె ల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు సూచించారు. గురువారం అనంతపురం ఆర్డీటీ క్రీడా మైదానంలో పర్యటనకు విచ్చేసిన చంద్రబాబును అమిలినేని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామ్మోహనచౌదరి, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన చౌళం మల్లికార్జున కలిశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ విజయాన్ని సాధించబోతోందని, ఏ మండలంలో ఎంత మెజార్టీ వస్తుందన్న విషయాన్ని వారు క్షుణ్ణంగా చంద్రబాబుకు వివరించారు. సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళుతున్నామని, ఆ దిశగా విజయాన్ని సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో చంద్రబాబు పాలన కోరుకుంటున్నారని, ఈసారి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని వివరించారు. నియోజకవర్గంలో సాగు, తాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని ప్రజలకు భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. ఏ గ్రామంలో చూసినా ప్రతి ఒక్కరు టీడీపీ పాలనవైపు మొగ్గుచూపుతున్నారని తెలిపారు.

Updated Date - Mar 29 , 2024 | 12:12 AM