సోషల్ మీడియాలో పోస్టు
ABN , Publish Date - Feb 01 , 2024 | 12:16 AM
వైసీపీ వర్గీయులపై సోషల్ మీడియాలో దూషించాడంటూ మండలంలోని హుసేనపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు బాబురెడ్డిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. వైసీపీ నాయకులపై సోషల్ మీడియాల్లో దూషించినట్లు ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేయడంతో బాబురెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గంగాధర్ తెలిపారు.
![సోషల్ మీడియాలో పోస్టు](https://media.andhrajyothy.com/media/2023/20231205/31cmtr1_85c60ed9d5.jpg)
టీడీపీ నాయకుడిపై కేసు
చిలమత్తూరు, జనవరి 31: వైసీపీ వర్గీయులపై సోషల్ మీడియాలో దూషించాడంటూ మండలంలోని హుసేనపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు బాబురెడ్డిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. వైసీపీ నాయకులపై సోషల్ మీడియాల్లో దూషించినట్లు ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేయడంతో బాబురెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గంగాధర్ తెలిపారు. బాబురెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ కార్యకర్తలను స్థానిక వైసీపీ నాయకులు ప్రలోభాలకు గురి చేశారన్నారు. తమ పార్టీలో చేరాలని పట్టుబట్టడం, వారు ససేమిరా అనడంతో కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగారన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకుడిగా తాను కార్యకర్తలతో ఫోనలో మాట్లాడి ధైర్యం చెప్పానన్నారు. వైసీపీ నాయకులను ఎక్కడా దూషించలేదని చెప్పుకొచ్చారు. వైసీపీ నాయకుల ప్రస్తావనే తేలేదనీ, అయినా తాను దూషించాననంటూ వైసీపీ నాయకులు ఫిర్యాదు చేయడం సరికాదన్నారు. తాను సొంత పనిమీద బెంగళూరు వెళ్లగా.. పోలీసులు అక్కడికే వచ్చి అరెస్టు చేశారన్నారు. గతంలో వైసీపీ నాయకులు.. టీడీపీ వర్గీయులపై నానా దుర్భాషలాడినా పోలీసులు కేసులు నమోదు చేయలేదన్నారు. అధికార పార్టీ వారు ఇచ్చిన ఫిర్యాదుతో ఆగమేఘాల మీద బెంగళూరులో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి, కేసు నమోదు చేయడం ఏంటని మండిపడ్డారు.