Share News

CONGRATES: బీసీలకు టీడీపీ పెద్దపీట

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:55 PM

టీడీపీ అధినేత చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేశారని గుం తకల్లు అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. గుత్తి పట్టణానికి చెందిన వెంకటశివుడు యాదవ్‌కు అనంతపురం పార్లమెంట్‌ అధ్యక్షుడిగా నియమించడంతో బుధవారం రాత్రి ఆయన స్వగృహం వద్ద టీడీపీ శ్రేణులతో కోలాహలం నెలకొంది.

CONGRATES: బీసీలకు టీడీపీ పెద్దపీట
టీడీపీ జిల్లా అధ్యక్షుడికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న గుమ్మనూరు జయరాం

గుత్తి, ఏప్రిల్‌ 24: టీడీపీ అధినేత చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేశారని గుం తకల్లు అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. గుత్తి పట్టణానికి చెందిన వెంకటశివుడు యాదవ్‌కు అనంతపురం పార్లమెంట్‌ అధ్యక్షుడిగా నియమించడంతో బుధవారం రాత్రి ఆయన స్వగృహం వద్ద టీడీపీ శ్రేణులతో కోలాహలం నెలకొంది. జయరాం వెంటకశివుడు యాదవ్‌కు పుష్పగుచ్ఛాన్ని అందించి అభినందించారు.


వెంకటశివుడుయాదవ్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు నాయకులు, కార్యకర్తలను కలుపుకుని పార్టీ గెలుపునకు కృషి చేస్తానన్నారు. కేసీ హరి, న్యాయవాది సోమశేఖర్‌, నాగేంద్ర, కేశవనాయుడు, ఎంకే చౌదరి, రవి, నారాయణస్వామి, తెలుగు యువత మండల నాయకుడు సుధాకర్‌యాదవ్‌, కమ్మసంఘం మండల అధ్యక్షుడు నాగరాజు, మల్లికార్జున, నరేంద్రచౌదరి పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 24 , 2024 | 11:55 PM