Share News

BK : ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయభేరి

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:06 AM

ప్రస్తుతం జరుగుతున్న సార్వ త్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయభేరి మోగిస్తుందని, చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రి కావడం తథ్యమని టీ డీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి పేర్కొన్నారు. ఆ యన బుధవారం సవిత నామి నేషనకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల తో మాట్లాడుతూ... ఉమ్మడి జిల్లాలోని 14అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్‌ స్థానాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు విజయం సాఽధిస్తారన్నారు.

BK : ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయభేరి

పెనుకొండ, ఏప్రిల్‌ 24 : ప్రస్తుతం జరుగుతున్న సార్వ త్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయభేరి మోగిస్తుందని, చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రి కావడం తథ్యమని టీ డీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి పేర్కొన్నారు. ఆ యన బుధవారం సవిత నామి నేషనకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల తో మాట్లాడుతూ... ఉమ్మడి జిల్లాలోని 14అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్‌ స్థానాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు విజయం సాఽధిస్తారన్నారు.


ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అన్నివిధాలా అభివృద్ధి బాటలో నడిపిస్తామన్నారు. ప్రధానమంత్రి యోజ్‌గార్‌ పథకం నిధుల ద్వారా అర్థంతరంగా ఆగిపోయిన రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. కొత్తరోడ్ల నిర్మాణ పనులు చేపడతామన్నారు.


టీడీపీ పాలనలోనే ఉమ్మడి జిల్లా పారిశ్రామికంగా, పర్యాటకంగా, వ్యవసాయపరంగా అభివృద్ధి సాధించిందన్నారు. తాగు, సాగునీరు తెచ్చిన ఘనత, ప్రాజెక్ట్‌లు నిర్మించిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ప్రజల కష్టాలు తీరాలన్నా చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు. ప్రతి ఒక్కరూ సైకిల్‌ గుర్తుకు ఓటేసి టీడీపీని గెలిపించాలని బీకే కోరారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 25 , 2024 | 12:06 AM