పురం ప్రశాంతతకు టీడీపీని ఆదరించండి
ABN , Publish Date - Mar 29 , 2024 | 12:23 AM
నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీని ఆదరించాలని ఆ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ నివాసరావు పేర్కొన్నారు.
ఇంటింటి ప్రచారంలో నాయకులు
హిందూపురం, మార్చి 28 : నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీని ఆదరించాలని ఆ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ నివాసరావు పేర్కొన్నారు. ఆయన గురువారం టీడీపీ నాయకులతో కలిసి పట్టణంలోని కోట ప్రాంతంలో టీడీపీ సూపర్సిక్స్ పథకాలకు సంబంధించి క్యాలెండర్లను ఇంటింటికీ వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే హిందూపురం పట్టణంతోపాటు నియోజకవర్గంలో భూదందాలు, సెటిల్మెం ట్లు, దౌర్జన్యాలు ఉండవన్నారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో నియోజక వర్గంలో ఎక్కడైనా ఒక్క భూదందా జరిగిందా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ప్రజలపక్షాన ఉంటుందని, అనుభవం కలిగిన చంద్రబాబుకు మన మద్దతు ఇచ్చి సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వాణిజ్య విభాగం పార్లమెంట్ అధ్యక్షుడు జేపీకే రాము, పట్టణాధ్యక్షుడు రమేష్, కౌన్సిలర్ రాఘవేంద్ర, మోదాశివ, మురళి, చైతన్య తదితరులు పాల్గొన్నారు.