శేషవాహనంపై ఊరేగిన శ్రీవారు
ABN , Publish Date - Apr 20 , 2024 | 01:01 AM
తాడిమర్రి, ఏప్రిల్19: మండలకేంద్రంలో లక్ష్మీతారమచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం అర్చకులు స్వామి వారి ఉత్సవ మూర్తిని నాగశేషువాహనంపై కొలువుదీర్చి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు.
తాడిమర్రి, ఏప్రిల్19: మండలకేంద్రంలో లక్ష్మీతారమచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం అర్చకులు స్వామి వారి ఉత్సవ మూర్తిని నాగశేషువాహనంపై కొలువుదీర్చి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. గ్రామస్థులు పెద్దఎత్తున స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈనెల 23వ తేదీన బ్రహ్మరథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయకమిటీ సభ్యులు తెలిపారు.