Share News

కందికుంట ప్రచారానికి విశేష స్పందన

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:31 AM

నల్లచెరువు, ఏప్రిల్‌ 18: మండలంలో గురువారం టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ చేపట్టిన ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభించింది.

 కందికుంట ప్రచారానికి విశేష స్పందన

నల్లచెరువు, ఏప్రిల్‌ 18: మండలంలో గురువారం టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ చేపట్టిన ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభించింది. గ్రా మాల్లో ప్రజలు అడగడుగునా అపూర్వ స్వాగతం పలికారు. మండలంలోని రాజంవాండ్లపల్లి, రాజంవాండ్లపల్లితండా, పోలేవాండ్లపల్లి, పూలకుంటపల్లి, బాలేపల్లి ఎగువ, దిగువ తండాలు, పి.కొత్తపల్లి గ్రామాల్లో కందికుంట ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. గ్రామాల్లోకి రాగానే స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. అనంతరం ఆయ న ఇంటింటా తిరుగుతూ.. సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని ప్రజల్ని అభ్యర్థించారు. చంద్రబాబు సీఎం అయితే చేపట్టే అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను వివరించారు. సూపర్‌సిక్స్‌ పథకాలతో కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక విధానాలను తెలిపారు. ఎన్నికల్లో వైసీపీని ఇంటికి సాగనంపాలని, కూటమిని గెలిపించాలని కోరారు. ప్రచారంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:31 AM