Share News

పరిటాల శ్రీరామ్‌ పాదయాత్రకు సంఘీభావం

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:10 AM

ధర్మవరంలో పరిటాల శ్రీరామ్‌ చేపట్టిన పాదయాత్రలో రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు, టీడీపీ నాయకులు సోమవారం పాల్గొని సంఘీభావం తెలిపారు.

పరిటాల శ్రీరామ్‌ పాదయాత్రకు సంఘీభావం
పరిటాల శ్రీరామ్‌ను సన్మానిస్తున్న కనగానపల్లి తెలుగు యువత నాయకులు

శింగనమల, జనవరి 8: ధర్మవరంలో పరిటాల శ్రీరామ్‌ చేపట్టిన పాదయాత్రలో రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు, టీడీపీ నాయకులు సోమవారం పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో దాసరి గంగాధర్‌, మాజీ ఎంపీటీసీ కుళ్లాయ ప్ప, బీసీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం.ఆదినారాయణ, బండి పరుసురాం, బెస్తనారాయణస్వామి, తలారి తిప్పన్న, పవన, దండు సతీష్‌, రంగస్వామి, శేఖర్‌ పాల్గొన్నారు.

ధర్మవరంరూరల్‌ : పరిటాలశ్రీరామ్‌ చేపట్టిన ప్రజా చైతన్యయాత్రలో కనగానపల్లి మండల తెలుగు యువత నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో తెలుగు యువత మాజీ మండల అధ్యక్షుడు మనోహర్‌నాయుడు, గిరిశాల కుమార్‌, అర్జున, పసల ఈశ్వర్‌, బట్టాధనుంజయ్‌, శ్రీహరి పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 12:10 AM