Share News

టీడీపీతోనే సామాజిక న్యాయం: పల్లె

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:42 AM

పుట్టపర్తి, పిబ్రవరి 14 : తెలుగుదేశం పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి పేర్కొన్నారు. కొత్తచెరువు మండలం మైలేపల్లికి చెందిన 30 కుటుంబాల వారు బుధవారం వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు.

    టీడీపీతోనే సామాజిక న్యాయం: పల్లె

పుట్టపర్తి, పిబ్రవరి 14 : తెలుగుదేశం పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి పేర్కొన్నారు. కొత్తచెరువు మండలం మైలేపల్లికి చెందిన 30 కుటుంబాల వారు బుధవారం వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. వారిని జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పల్లె రఘు నాథరెడ్డి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ విధానాలతో విసిగిపోయిన అనేక మంది ఆ పార్టీ శ్రేణులు టీడీపీలో వలస వస్తున్నట్లు తెలిపారు. టీడీపీలో కష్ట పడి పని చేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. అలాగే ఈ పార్టీలో అన్ని వర్గాల వారికి సమన్యాయం లభిస్తుందని అన్నారు. టీడీపీలోకి చేరిన వారిలో వెంకటేశు, శ్రీనివాసులు, వెంకటరాముడు, శివ, నారాయణస్వామి, అనూష, కృష్ణవేణి, సాయి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో నాయకులు సాలక్కగారి శ్రీనివాసులు, ఒలిపి శ్రీనివాసులు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 12:42 AM