Share News

AP politics: ఎల్‌ఎంకు అవమానం!

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:46 PM

నియోజకవర్గంలో పట్టున్న వైసీపీ సీనియర్‌ నాయకుడు ఎల్‌ఎం మోహనరెడ్డికి అవమానం జరిగిందని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తలారి రంగయ్య బుధవారం నామినేషన దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన ఎల్‌ఎం మోహనరెడ్డిని ఆహ్వానించారు. ఆయన్ను రోడ్‌షోకే పరిమితం చేశారు.

AP politics: ఎల్‌ఎంకు అవమానం!
LM on vehical along with rangaiah

కళ్యాణదుర్గం రూరల్‌, ఏప్రిల్‌ 24: నియోజకవర్గంలో పట్టున్న వైసీపీ సీనియర్‌ నాయకుడు ఎల్‌ఎం మోహనరెడ్డికి అవమానం జరిగిందని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తలారి రంగయ్య బుధవారం నామినేషన దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన ఎల్‌ఎం మోహనరెడ్డిని ఆహ్వానించారు. ఆయన్ను రోడ్‌షోకే పరిమితం చేశారు. నెల రోజుల కిందట పార్టీలోకి వచ్చిన ఉమామహేశ్వరనాయుడుని మాత్రం నామినేషన దాఖలు చేయడానికి వెంట పెట్టుకుని ఆర్‌ఓ వద్దకు వెళ్లడంపై ఎల్‌ఎం అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అనుచరులు, పట్టున్న సీనియర్‌ నాయకుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. నామినేషన కార్యక్రమానికి పిలిచి అవమానించడంలో ఆంతర్యమేమిటని నిలదీస్తున్నారు.

Updated Date - Apr 24 , 2024 | 11:46 PM