పూర్వవిద్యార్థుల సమ్మేళనం
ABN , Publish Date - Mar 14 , 2024 | 11:49 PM
సర్వర్ సమస్య తలెత్తడంతో నూతన ఆధార్ నమోదుతో పాటు ఆధార్ కార్డులో పేర్లు తదితరాల మార్పులు, చేర్పుల కోసంవచ్చిన చిన్నారులు, మహిళలు పడిగాపులు కాయాల్సి వస్తోంది.
మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్న చిన్నారులు, మహిళలు
పెనుకొండ రూరల్, మార్చి14 : సర్వర్ సమస్య తలెత్తడంతో నూతన ఆధార్ నమోదుతో పాటు ఆధార్ కార్డులో పేర్లు తదితరాల మార్పులు, చేర్పుల కోసంవచ్చిన చిన్నారులు, మహిళలు పడిగాపులు కాయాల్సి వస్తోంది. పెను కొండలోని ఆంధ్రబ్యాంకు, సచివాలయం-3లోని ఆధార్ కేంద్రాల్లో పేర్ల మార్పులు, చేర్పుల కోసం వెసలుబాటు కల్పించారు. అయితే మూడు రోజుల నుంచి సర్వర్ పనిచేయక పోవడంతో మహిళలు, చిన్నారుల అవస్థలు వర్ణనాతీతం. వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయంలోనూ సర్వర్ సమస్య తలెత్తడంతో చిన్నప్లిలలను ఎత్తుకొని ఎండలో పడిగాపులు కాయా ల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరో ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.