బలిజలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలి
ABN , Publish Date - Mar 03 , 2024 | 12:06 AM
బలిజలకు అన్ని ప్రధాన పార్టీలు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని రాయలసీమ బలిజ మహాసంఘం అధ్యక్షుడు శంకరయ్య డిమాండ్ చేశా రు.
అనంతపురం ప్రెస్క్లబ్, మార్చి 2: బలిజలకు అన్ని ప్రధాన పార్టీలు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని రాయలసీమ బలిజ మహాసంఘం అధ్యక్షుడు శంకరయ్య డిమాండ్ చేశా రు. ఈ మేరకు శనివారం ఆ సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... రాయలసీమ జిల్లాల్లో అత్యధిక జనాభా కలిగిన బలిజలకు అన్ని పార్టీలు అవకాశాలు కల్పించకుండా మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆరేడు శాతం ఉన్న కొన్ని అగ్రకులాలు మాత్రమే అత్యధిక సీట్లు కేటాయించుకుంటూ బలిజ సామాజికవర్గాన్ని అన్యాయం చేస్తున్నాయన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అనంత జిల్లాలో రెండు ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. కోశాధికారి కోనేటి సాయిప్రసాద్, రిటైర్డ్ ప్రిన్సిపల్ సురేష్, గూండా మురళీకృష్ణ, దండు శ్రీనివాసులు, సానె ప్రభాకర్, లింగమయ్యస్వామి, మధుసూదన, గాలి మనోహర్, రామాంజనేయులు, సుధాకర్, గురుమూర్తి పాల్గొన్నారు.