Road accident i బెంగళూరులో రోడ్డు ప్రమాదం
ABN , Publish Date - Nov 25 , 2024 | 12:05 AM
బెంగళూరులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉరవకొండకు చెందిన బీటెక్ విద్యార్థి రామేశ్వర్ రెడ్డి (19) మృతి చెందాడు. పట్టణంలోని భారత ఫర్టిలైజర్స్ యజమాని సంజీవరెడ్డి కుమారుడు రామేశ్వర్రెడ్డి బెంగళూరులోని దయానందసాగర్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
ఉరవకొండ విద్యార్థి మృతి
ఉరవకొండ, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): బెంగళూరులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉరవకొండకు చెందిన బీటెక్ విద్యార్థి రామేశ్వర్ రెడ్డి (19) మృతి చెందాడు. పట్టణంలోని భారత ఫర్టిలైజర్స్ యజమాని సంజీవరెడ్డి కుమారుడు రామేశ్వర్రెడ్డి బెంగళూరులోని దయానందసాగర్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
కాగా శనివారం సాయంత్రం స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు ముగించుకుని ఆటోలో హాస్టల్కు బయలుదేరాడు. హోరువల్లి, కనకపుర రోడ్డు సమీపంలో ఆటోను కర్ణాటక బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో రామేశ్వర్రెడ్డికి తీవ్ర గాయాలవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. కుమారుడు మృతి చెందాడని తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువుల కన్నీరు మున్నీరయ్యారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...