Share News

ఘనంగా రథసప్తమి

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:18 AM

ధర్మవరం, ఫిబ్రవరి 16: పట్టణంలోని పలు ఆలయాల్లో రథసప్తమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రధానంగా లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంతో పాటు శ్రీనివాసనగర్‌, కొత్తపేట ప్రాంతాల్లోని వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.

ఘనంగా రథసప్తమి

ధర్మవరం, ఫిబ్రవరి 16: పట్టణంలోని పలు ఆలయాల్లో రథసప్తమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రధానంగా లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంతో పాటు శ్రీనివాసనగర్‌, కొత్తపేట ప్రాంతాల్లోని వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తొలుత అర్చకులు ఆలయాల్లో మూలవిరాట్‌లకు అభిషేకాలు, అలంకరణలు చేశారు. అనంతరం అర్చనలు, విశేష పూజలు, మహామంగళహారతి తదితర కార్యక్రమాలు జరిపారు. తర్వాత స్వాముల ఉత్సవ విగ్రహాలను పట్టువస్ర్తాలతో అలంకరించి పూలపల్లకిలో కొలువుదీర్చి పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. మంగళవాయిద్యాలు, భజనల నడుమ ఊరేగింపు భక్తిశ్రద్ధలతో సాగింది. అన్నమయ్య సేవామండలి సభ్యులు అన్నమయ్య సంకీర్తలను ఆలపించారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అ వాంఛనీయ ఘటనలు జరగకుండా వనటౌన సీఐ సుబ్రమణ్యం పోలీసు బందోబస్తు చేపట్టారు.

Updated Date - Feb 17 , 2024 | 12:18 AM