Share News

సింహవాహనంపై ఊరేగిన రాములోరు

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:40 PM

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైనా గురువారం మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో రాములవారు సింహవాహనంపై ఊరేగారు.

సింహవాహనంపై ఊరేగిన రాములోరు
సింహవాహనంపై రాములవారు

అనంతపురం కల్చరల్‌, ఏప్రిల్‌ 18: శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైనా గురువారం మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో రాములవారు సింహవాహనంపై ఊరేగారు. ఉదయం సీతారాములకు వివిధ అభిషేకాలు, సహస్ర నామార్చన నిర్వహించారు. సాయంత్రం విశేషంగా అలంక రించిన రథంలో సింహ వాహనంపై స్వామివారి ఉం చి.. పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ ఆవరణం లోని వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మహిళలు కోలాటం ఆడా రు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రమేష్‌బాబు, అనువంశీకుడు హోసూరు రామసుబ్రహ్మణ్యం, ధర్మకర్తల మండలి సభ్యులు కల్పన, రాజేశ్వరి, వెంకటస్వామి, సురేష్‌బాబు, తిమ్మారెడ్డి, చంద్రశేఖర్‌, డి.సుబ్రహ్మణ్యం, ప్రధానార్చకుడు నరసింహశాసి్త్ర, పరమేష్‌, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 11:40 PM