Share News

రఘువీరా ఓ పొలిటికల్‌ బ్రోకర్‌

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:03 AM

సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి ఓ పొలిటికల్‌ బ్రోకర్‌ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిద్ధం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు శుక్రవారం ఆయన అనంతపురం వచ్చారు.

రఘువీరా ఓ పొలిటికల్‌ బ్రోకర్‌

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అనంతపురం, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి ఓ పొలిటికల్‌ బ్రోకర్‌ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిద్ధం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు శుక్రవారం ఆయన అనంతపురం వచ్చారు. ‘పగటిపూట ఖూనీలు చేసేవాళ్లు కూడా మా పార్టీ గురించి మాట్లాడితే ఎలా..?’ అని రఘువీరా చేసిన వ్యాఖ్యలపై పెద్దిరెడ్డి స్పందించారు. రాజశేఖర్‌రెడ్డి బతికున్న రోజుల్లో రఘువీరారెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి ఆయన అడుగులకు మడుగులొత్తారని అన్నారు. రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన తరువాత వైఎస్‌ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేసినవాళ్లలో ప్రధాన ముద్దాయి రఘువీరారెడ్డే అని అన్నారు. అలాంటి వ్యక్తికి తన గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. ‘నేను తప్పులు చేసి ఉంటే నిరూపించమనండి... రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అని రఘువీరాకు సవాలు విసిరారు. కాంగ్రెస్‌ పార్టీకి వెన్నుపోటు పొడిచిందే రఘువీరారెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి అని అన్నారు. రాజశేఖర్‌రెడ్డి పేరు చెప్పుకొని వేల కోట్లు దోచుకున్న వ్యక్తుల్లో రఘువీరారెడ్డి ఒకరని అన్నారు. ‘పుట్టపర్తి సత్యసాయిబాబా చనిపోతే.. రేపు.. ఎల్లుండి అంటూ పార్థివదేహాన్ని తీసుకురాకుండా రోజులు తరబడి గడిపారు. బాబా డబ్బంతా లారీల్లో తరలించింది రఘువీరారెడ్డి కాదా?’ అని ప్రశ్నించారు. ఈ విషయం తనకంటే జిల్లావాసులకే ఎక్కువగా తెలుసని అన్నారు. రఘువీరారెడ్డి ఒక పొలిటికల్‌ బ్రోకర్‌ అని, అతని గురించి తాను మాట్లాడటం ఎందుకని అన్నారు. చంద్రబాబు, పవన కల్యాణ్‌ పాడేపాటే రఘువీరా పాడుతున్నారని, నోటికొచ్చింది మాట్లాడుతారని, అతనికి పిచ్చి అని అన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 12:03 AM