Share News

చంద్రబాబుతోనే ప్రజా సంక్షేమం

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:19 AM

ధర్మవరం, ఫిబ్రవరి 24: ప్రజా సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని మున్సిపల్‌ మాజీ చైర్మన బీరేగోపాలకృష్ణ, టీడీపీ పట్టణాధ్యక్షుడు పరిశేసుధాకర్‌ పేర్కొన్నారు.

 చంద్రబాబుతోనే ప్రజా సంక్షేమం

- భవిష్యత్తుకు గ్యారెంటీలో టీడీపీ నాయకులు

ధర్మవరం, ఫిబ్రవరి 24: ప్రజా సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని మున్సిపల్‌ మాజీ చైర్మన బీరేగోపాలకృష్ణ, టీడీపీ పట్టణాధ్యక్షుడు పరిశేసుధాకర్‌ పేర్కొన్నారు. పట్టణంలోని 25వ వార్డులో శనివారం వారు టీడీపీ పట్టణ ప్రచార కమిటీ ఆధ్వర్యంలో బాబుష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలకు మినీమేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేసి పథకాల గురించి వివరించారు. చంద్రబాబు సీఎం అయితే అ న్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఆయనతోనే ప్రజా సంక్షేమం సాధ్యమవుతందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ వార్డు ఇనచార్జి భీమనేని ప్రసాద్‌నాయుడు, నాయకులు గడ్డం సూరి, చీమలరామాంజి, క్లస్టర్‌ రామాంజినేయులు, గంగాధర్‌, శ్రీనివాసులు, రవి, పోతలయ్య, అమర్‌నాథ్‌, కృష్ణ, చిరంజీవి, జనార్దన, సూరి, శీలామూర్తి, గడ్డం కుళ్లాయప్ప, మాధవరెడ్డి, బడిగింజలరమణ, కరెంటుఆది, తెలుగుమహిళలు స్వర్ణకుమారి, మున్ని, శారద, మీనాక్షి, అఖిల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 12:19 AM