Share News

ఆలయ భూములు కాపాడండి

ABN , Publish Date - Aug 21 , 2024 | 11:25 PM

బుక్కపట్నానికి చెందిన బసవేశ్వస్వామి ఆలయ భూముల అన్యాక్రాతం అవుతు న్నాయని, వాటిని కాపావాలని తహసీల్దార్‌ షాబుద్దీనకు ఆయల కమిటీ సభ్యులు బుధవారం వినతిపత్రం అందించారు.

ఆలయ భూములు కాపాడండి
తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న ఆలయ కమిటీ సభ్యులు

బుక్కపట్నం, ఆగస్టు 21: బుక్కపట్నానికి చెందిన బసవేశ్వస్వామి ఆలయ భూముల అన్యాక్రాతం అవుతు న్నాయని, వాటిని కాపావాలని తహసీల్దార్‌ షాబుద్దీనకు ఆయల కమిటీ సభ్యులు బుధవారం వినతిపత్రం అందించారు. గ్రామ సమీపంలోని సర్వేనెంబర్‌ 1414లో నాలుగు ఎకరాల బసవేశ్వరస్వామి ఆలయానికి చెందిన భూమి ఉందని, దాన్ని కొంతమంది అక్రమించుకోవాలని చూస్తున్నారని తెలిపారు. అలాగే మండల వ్యాప్తంగా ఆలయాలకు చెందిన భూములను గుర్తించి దేవదాయ శాఖకు చెందేలా చర్యలు చేపట్టలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్‌ దేరిశెట్టి సంజీవరాయుడు, కమిటీ సభ్యులు నాగభూషణం, దాసరి శ్రీనివాసులు, గాజుల బాలాజీ, ఈశ్వరప్ప, సతీష్‌, చంద్ర, ఆదినారాయణ, పురుషోత్తమ, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 11:25 PM