Share News

సమస్యలు పరిష్కరించాల్సిందే

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:38 PM

శింగనమల ఐసీడీఎస్‌ కార్యాలయంలో 404 మంది అంగన్వాడీలు తమకు అందిన షోకాజు నోటీసులకు బదులు పత్రాలు అందజేశారు. తమ సమస్యలు పరిష్కరించా ల్సిందేనని నినాదాలు చేశారు.

సమస్యలు పరిష్కరించాల్సిందే
శింగనమలలో సంజాయిషీ పత్రాలతో నిరసన

శింగనమల, జనవరి 17: శింగనమల ఐసీడీఎస్‌ కార్యాలయంలో 404 మంది అంగన్వాడీలు తమకు అందిన షోకాజు నోటీసులకు బదులు పత్రాలు అందజేశారు. తమ సమస్యలు పరిష్కరించా ల్సిందేనని నినాదాలు చేశారు. తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ఆర్‌టీసీ బస్టాండ్‌ వరకు ర్యాలీ చేపట్టి అక్కడ మనహారం చేశారు. అనంతరం ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద షాకాజు నోటీసులకు అంగన్వాడీలు బదులు పత్రాలను అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకురాలు రమణమ్మ, శ్యామలమ్మ, కాతాయణి, భారతి, ప్రమీలా, రత్నమ్మ, నాగేశ్వరి పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 11:38 PM