ప్రకాశరెడ్డీ.. ఇక నీ హామీలను నమ్మరు
ABN , Publish Date - Apr 22 , 2024 | 12:38 AM
ప్రకాశరెడ్డి... నీవు గత ఎన్నికల సమయంలో రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చుక్క నీరు కూడా ఇవ్వలేదు. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేశావ్. ఈ సారి ప్రజలు నిన్ను.. నీ హామీలను నమ్మో స్థితిలో లేరు... నీ ఓటమి ఖాయం.. ’ అని రాప్తాడు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల సునీత ఎమ్మెల్యే ప్రకాశరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
![ప్రకాశరెడ్డీ.. ఇక నీ హామీలను నమ్మరు](https://media.andhrajyothy.com/media/2024/20240413/_c94ada7b22.jpg)
చెన్నేకొత్తపల్లి, ఏప్రిల్ 21: ‘ ప్రకాశరెడ్డి... నీవు గత ఎన్నికల సమయంలో రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చుక్క నీరు కూడా ఇవ్వలేదు. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేశావ్. ఈ సారి ప్రజలు నిన్ను.. నీ హామీలను నమ్మో స్థితిలో లేరు... నీ ఓటమి ఖాయం.. ’ అని రాప్తాడు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల సునీత ఎమ్మెల్యే ప్రకాశరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండలంలోని ప్యాధిండి, చందమూరు, చిన్నపల్లి, హరియనచెరువు గ్రామా ల్లో ఆదివారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సునీత మాట్లాడు తూ... ఈ ఐదేళ్లూ టీడీపీ నాయకులు, కార్యకర్తలను తోపు సోదరులు అనేక ఇబ్బందులకు గురి చేశారని, అయినా వారు పార్టీని వీడకుండా ఉండటం అభినందనీయమని అన్నారు. అలాంటి వారికి పార్టీలో తప్పకుండా గుర్తింపు ఇస్తామన్నారు. ప్యాధిండిలో 15 కుటుంబాలు, చందమూరులో ఐదు కుటుం బాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నా యకుడు ఎల్ నారాయణచౌదరి, కన్వీనర్ ముత్యాల్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దండు ఓబులేశు, రామసుబ్బమ్మ, అంకే అమరేంద్ర, ముత్యాలప్ప, అంజి, నరసింహులు, జయరామిరెడ్డి, మోహన, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...