Share News

నడిమిదొడ్డిలో పోలీసుల కార్డెన సెర్చ్‌

ABN , Publish Date - May 25 , 2024 | 12:57 AM

నార్పల మండలం నడిమిదొడ్డిలో పోలీసులు కార్డెన సెర్చ్‌ ఆపరేషన శుక్రవారం నిర్వహించారు. శింగనమల సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ట్రబుల్స్‌ మాంగర్స్‌, పాత కేసుల్లోని నిందితుల ఇళ్లల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.

నడిమిదొడ్డిలో పోలీసుల కార్డెన సెర్చ్‌
తనిఖీ చేస్తున్న పోలీసులు

నార్పల, మే 24: నార్పల మండలం నడిమిదొడ్డిలో పోలీసులు కార్డెన సెర్చ్‌ ఆపరేషన శుక్రవారం నిర్వహించారు. శింగనమల సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ట్రబుల్స్‌ మాంగర్స్‌, పాత కేసుల్లోని నిందితుల ఇళ్లల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పశువుల పాకలు, వామిదొడ్లు, తదితర ప్రదేశాలను జల్లెడపట్టారు. రికార్డులు లేని రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కౌంటింగ్‌ రోజున, తరువాత ఎవరైనా గొడవలు, అల్లర్లకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.

Updated Date - May 25 , 2024 | 12:57 AM