Share News

BK: పార్థసారథి సంయమనం

ABN , Publish Date - May 08 , 2024 | 12:20 AM

టీడీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో వైసీపీ ప్రచారం రథం ఎదురుపడింది. దీంతో టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. అయితే బీకే సంస్కారాన్ని ప్రదర్శిస్తూ పరిస్థితిని చక్కదిద్దారు. గోరంట్ల మండలంలోని మల్లాపల్లిలో సోమవారం సాయంత్రం బీకే ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌ షో నిర్వహిస్తున్నారు.

BK:  పార్థసారథి సంయమనం
BK Parthasarathy ordering to give way to the YCP chariot

గోరంట్ల, మే 7: టీడీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో వైసీపీ ప్రచారం రథం ఎదురుపడింది. దీంతో టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. అయితే బీకే సంస్కారాన్ని ప్రదర్శిస్తూ పరిస్థితిని చక్కదిద్దారు. గోరంట్ల మండలంలోని మల్లాపల్లిలో సోమవారం సాయంత్రం బీకే ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌ షో నిర్వహిస్తున్నారు.


పెనుకొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి ఉషశ్రీ చరణ్‌కు సం బంధించిన ఖాళీ ప్ర చార రథం గోరంట్ల వైపు వెళ్తూ ఎదురుప డింది. దాన్ని చూపిన టీడీపీ శ్రేణులు కేకలు, ఈలలు వేస్తూ, దా రివ్వలేదు. వెంటనే బీ కే స్పందిస్తూ మైక్‌ ద్వారా పార్టీ శ్రేణులను మదలించారు. ఇది మంచి పద్ధతి కాదన్నా రు. ఎదుటివారు తప్పు చేస్తే మనం ప్రశ్నించే లా ఉండాలి కానీ మ నం ఎలాంటి పొరపా టు చేయకూడదని చెప్పి ఆ వాహనానికి దారి ఇప్పించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 08 , 2024 | 12:20 AM