Share News

satyakumar: ప్రజాసేవకే పరిటాల కుటుంబం అంకితం: సత్యకుమార్‌

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:46 PM

ధర్మవరం, ఏప్రిల్‌ 25: పరిటాల కుటుంబం అనునిత్యం ప్రజాసమస్యలపై పోరాడుతూ ప్రజాసేవకే అంకితమైందని ధ ర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి బీజేపీ అ భ్యర్థి సత్యకుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు. రాప్తాడు అ సెంబ్లీ నియోజకవర్గ కూ టమి టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతమ్మ నామినేషన కార్యక్రమం గురువారం జరిగింది.

satyakumar: ప్రజాసేవకే పరిటాల కుటుంబం అంకితం: సత్యకుమార్‌
పరిటాల రవీంద్రఘాట్‌ వద్దనివాళులర్పిస్తున్న సత్యకుమార్‌యాదవ్‌

ధర్మవరం, ఏప్రిల్‌ 25: పరిటాల కుటుంబం అనునిత్యం ప్రజాసమస్యలపై పోరాడుతూ ప్రజాసేవకే అంకితమైందని ధ ర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి బీజేపీ అ భ్యర్థి సత్యకుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు. రాప్తాడు అ సెంబ్లీ నియోజకవర్గ కూ టమి టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతమ్మ నామినేషన కార్యక్రమం గురువారం జరిగింది.


ఇందులో సత్యకుమార్‌ పాల్గొన్నారు. అనంతరం పరిటాల స్వగ్రామం వెంకటాపురానికి వెళ్లి అక్కడ పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌తో కలిసి పరిటాల రవి ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ... పరిటాల శ్రీరాములయ్య నుంచి ప రిటాల శ్రీరామ్‌ వరకు వారి కుటుంబం ప్రజాసేవకు అంకితమైందని తెలిపారు. ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా తామున్నామంటూ భరోసా వారి ఆదరాభిమానాలను చూరగొంటున్నారన్నారు. ఈ ఎన్నికల్లో సునీతమ్మ అత్యధిక మోజారిటీతో గెలుపొందాలని ఆయన ఆకాంక్షించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - Apr 25 , 2024 | 11:46 PM