టీడీపీతోనే ఇంటింటికి సంక్షేమం: నాయకులు
ABN , Publish Date - Mar 28 , 2024 | 12:00 AM
టీడీపీ అధికారంలోకి వస్తేనే ప్రతి కుటుంబా నికి సంక్షేమం అందుతుందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. హిందూపురం నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, మండల కన్వీనర్ రంగారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని సుబ్బరావుపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
చిలమత్తూరు, మార్చి 27: టీడీపీ అధికారంలోకి వస్తేనే ప్రతి కుటుంబా నికి సంక్షేమం అందుతుందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. హిందూపురం నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, మండల కన్వీనర్ రంగారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని సుబ్బరావుపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమలుచేసే సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రతి ఇంటికి ఏడాది మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయా ణం, పూర్ టు రిచ కార్యక్రమంతో పేదలను ధనికులను చేయడం వంటి పథ కాలు అందుతాయని వివరించారు. వైసీపీ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బం దులను గుర్తు చేస్తూ... టీడీపీ అధికారంలోకి రాగానే ప్రజలకు మంచి జరుగు తుందని తెలిపారు. టీడీపీ నాయకులు శ్రీదేవి, బేకరీ గంగాధర్, సూర్యనారాయణ, పందిపర్తి గంగాధర్, మీసేవ సూరి, గంగాధర్, హిదయతుల్లా, నారాయణప్ప, వెంకటసుబ్బయ్య, నాగార్జున, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.