Nregs: కూలీల హాజరు శాతం పెరగాలి
ABN , Publish Date - May 24 , 2024 | 12:16 AM
ఉపాధి పనులకు కూలీలు వచ్చేలా చూడాలని జడ్పీ సీఈఓ మైఖోమ్ నిదియాదేవి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఉపాధి పనులపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీల్లో ఏఏ పనులు చేస్తున్నారని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. తక్షణం అన్ని గ్రామ పంచాయతీల్లో పనులు వేగవంతం చేయాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు.
![Nregs: కూలీల హాజరు శాతం పెరగాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కూడేరు, మే 23: ఉపాధి పనులకు కూలీలు వచ్చేలా చూడాలని జడ్పీ సీఈఓ మైఖోమ్ నిదియాదేవి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఉపాధి పనులపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీల్లో ఏఏ పనులు చేస్తున్నారని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. తక్షణం అన్ని గ్రామ పంచాయతీల్లో పనులు వేగవంతం చేయాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. వివిధ అంశాలపై ఏపీఓ తులసి ప్రసాద్ను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పర్యటించి పనులకు కూలీలు హాజరయ్యే విధంగా అవగాహన కల్పించాలని ఎంపీడీఓను ఆదేశించారు.