Share News

నాగమణి ఇంటిని కూల్చేశారు

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:04 AM

మండలంలోని బసవతారకనగర్‌లో నివాసముం టున్న నాగమణి ఇంటిని కూల్చేశారు. కొన్ని రోజు లుగా ఆమె ఇల్లు ఉన్న స్థలం తనదంటూ తాడి పత్రి పట్ణణంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవి శంకర్‌ నాగమణితో గొడవపడుతూ వస్తు న్నాడు.

నాగమణి ఇంటిని కూల్చేశారు
పడగొట్టిన నాగమణి ఇల్లు

అనంతపురం రూరల్‌, మార్చి 11: మండలంలోని బసవతారకనగర్‌లో నివాసముం టున్న నాగమణి ఇంటిని కూల్చేశారు. కొన్ని రోజు లుగా ఆమె ఇల్లు ఉన్న స్థలం తనదంటూ తాడి పత్రి పట్ణణంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవి శంకర్‌ నాగమణితో గొడవపడుతూ వస్తు న్నాడు. ఈ క్రమంలో వారం క్రితం ఇంటిని పడ గొట్టే ప్రయత్నం చేశాడు. అయితే నాగమణి పోలీసు లకు ఫిర్యాదు చేయడంతో వెనకుతగ్గారు. తిరిగి సోమవారం నాగమణి ఎస్పీని కలసి తన సమ స్యను చెప్పుకునేందుకు వెళ్లింది. అక్కడ ఎస్పీ లేకపోవడంతో తిరిగి ఇంటికొచ్చే సరికి రవిశంకర్‌ ఇంటిని దౌర్జన్యంగా పడగొట్టినట్లు నాగమణి వాపోయింది. 20 ఏళ్లుగా నివాసముంటున్న తన ఇల్లు కూలిపోయి ఉండటాన్ని చూసి.. కన్నీంటి పర్యంత మైంది. ఇంటి స్థలం తనదని కానిస్టేబుల్‌ రవిశంకర్‌ నిత్యం ఇబ్బందులకు గురి చేస్తున్నా రని నాగ మణి చెప్పుకొచ్చింది. ఇదే దిగులుతోనే తన భర్త కూడా అనారోగ్యానికి గురై మర ణించాడని ఆవేదన వ్యక్తం చేసింది. కానిస్టేబుల్‌ బెదిరిం పులపై రూరల్‌ పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయింది. ఈ రోజు కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సమయంలో కానిస్టేబుల్‌ ఇంటిని కూల్చివేసినట్లు చెప్పుకొచ్చింది. అధికారులే తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.

Updated Date - Mar 12 , 2024 | 12:04 AM