TDP : సవిత నామినేషనకు తరలిరండి: టీడీపీ
ABN , Publish Date - Apr 22 , 2024 | 12:30 AM
తెలుగుదేశం పార్టీ పెనుకొండ నియోజకవర్గ ఎ మ్మెల్యే అభ్యర్థి సవిత నామినేషనకు తరలిరావాలని టీడీపీ నాయకులు పిలుపుని చ్చారు. పట్టణంలోని టీడీపీ కార్యాల యంలో నియోజకవర్గానికి చెందిన నాయకులు ఆ దివారం సమావేశం నిర్వహించారు. నామినేషనకు సంబంధించిన పలు విషయాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈ నెల 24న ఉదయం 9గంట లకు నామినేషన వేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.
![TDP : సవిత నామినేషనకు తరలిరండి: టీడీపీ](https://media.andhrajyothy.com/media/2024/20240413/21pkdt1_22ab931f74.jpg)
పెనుకొండ టౌన, ఏప్రిల్ 21 : తెలుగుదేశం పార్టీ పెనుకొండ నియోజకవర్గ ఎ మ్మెల్యే అభ్యర్థి సవిత నామినేషనకు తరలిరావాలని టీడీపీ నాయకులు పిలుపుని చ్చారు. పట్టణంలోని టీడీపీ కార్యాల యంలో నియోజకవర్గానికి చెందిన నాయకులు ఆ దివారం సమావేశం నిర్వహించారు. నామినేషనకు సంబంధించిన పలు విషయాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈ నెల 24న ఉదయం 9గంట లకు నామినేషన వేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ముందుగా పెనుకొండ పట్టణంలోని రామభద్రాలయం సమీపంలోని చెరువు రోడ్డు నుంచి కృష్ణదేవరాయల సర్కిల్, తెలుగుతల్లి సర్కిల్, పార్టీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తామన్నారు.
అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సవిత నామినేషన వేస్తారని తెలిపారు. కార్యక్రమంలో టీడీప మండల మాజీ కన్వీనర్ శ్రీరాములు, నాయకులు కేశవయ్య, చిన్నవెంకటరాముడు, శ్రీనివాసులు, త్రివేం ద్ర, బాబుల్రెడ్డి, అశ్వర్థప్ప, జఫ్రుల్లాఖాన, మైనార్టీ నాయకుడు దాదు, కన్వీనర్ సిద్దయ్య, రఘువీరాచౌదరి, కౌన్సిలర్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
అఖండ మెజార్టీతో గెలిచి వస్తా
టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత
పెనుకొండ టౌన: ఊహించని అఖండ మెజార్టీతో డిక్లరేషన ఫా రం తీసుకుని మీ ముందుకు వస్తా నని టీడీపీ అధినేత చంద్రబాబుతో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత అన్నారు. ఉండవల్లిలోని టీడీపీ కా ర్యాలయంలో ఆదివారం చంద్రబా బు చేతులమీదుగా సవిత బీ-ఫా రం అందుకున్నారు. ఈ సందర్భం గా సవిత మాట్లాడుతూ తన మీద నమ్మకం ఉంచి నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అదే నమ్మకాన్ని నాయకులు, కార్యకర్తలపై తాను చూపిస్తానని తెలిపారు. ఈనెల 24న నామినేషన వేయనున్నట్లు ఆమె ఫోన ద్వారా విలేకరులకు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ వార్తల కోసం...