Share News

పల్లె సింధూర నామినేషనకు తరలిరండి

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:16 AM

కొత్తచెరువు/ నల్లమాడ, ఏప్రిల్‌ 17: పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ కూటమి అభ్యర్థిగా పల్లె సింధూరా రెడ్డి గురువారం నామినేషన దాఖలు చేయనున్నారని, ఈ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలందరూ పెద్దఎత్తున తరలిరావాలని టీడీపీ మండల,పట్టణ కన్వీనర్‌లు రామకృష్ణ, ఒలిపిశీన పిలుపునిచ్చారు.

పల్లె సింధూర నామినేషనకు తరలిరండి

కొత్తచెరువు/ నల్లమాడ, ఏప్రిల్‌ 17: పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ కూటమి అభ్యర్థిగా పల్లె సింధూరా రెడ్డి గురువారం నామినేషన దాఖలు చేయనున్నారని, ఈ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలందరూ పెద్దఎత్తున తరలిరావాలని టీడీపీ మండల,పట్టణ కన్వీనర్‌లు రామకృష్ణ, ఒలిపిశీన పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో గురువారం ఉదయం 10 నుంచి 11గంటల సమయంలో పల్లె సింధూరారెడ్డి నామినేషన దాఖలు చేయనున్నారని తెలిపారు. నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులందరూ పెద్దఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో నాయకులు సాలక్కగారి శ్రీనివాసులు, కాంట్రాక్టర్‌ లక్ష్మీనారాయణ, గాజుల చంద్ర, బండ్లపల్లిరాజు, నాగేంద్ర, నాగేంద్ర, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే పల్లె సింధూర నామినేషన కార్యక్రమానికి నల్లమాడల మండల కూటమి శ్రేణులు తరలిరావాలని టీడీపీ మండలకన్వీనర్‌ మైలే శివశంకర్‌ ప్రకటనలో పిలుపునిచ్చారు.

Updated Date - Apr 18 , 2024 | 12:16 AM