Share News

ఎమ్మెల్యే గారూ.. మీ హామీ ఏమైంది..?

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:45 PM

డంపింగ్‌ యార్డును తరలిస్తానని గత ఎన్నికల సమ యంలో ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని, ఇప్పటికైనా ఆ హామీని నిలబెట్టుకో వాలని తెలుగుదేశం పార్టీ బీసీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కనుమ చౌడయ్య డిమాండ్‌ చేశా రు.

ఎమ్మెల్యే గారూ.. మీ హామీ ఏమైంది..?
డంపింగ్‌ యార్డు వద్ద ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు

అనంతపురంరూరల్‌, మార్చి 1: డంపింగ్‌ యార్డును తరలిస్తానని గత ఎన్నికల సమ యంలో ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని, ఇప్పటికైనా ఆ హామీని నిలబెట్టుకో వాలని తెలుగుదేశం పార్టీ బీసీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కనుమ చౌడయ్య డిమాండ్‌ చేశా రు. శుక్రవారం గుత్తిరోడ్డులోని డంపింగ్‌ యార్డు వద్ద రాజీవ్‌కాలనీ వాసులతో కలసి టీడీపీ నాయకులు చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. డంపింగ్‌ యార్డు వలన రాజీవ్‌ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారన్నారు. గురువారం రాత్రి నుంచి వెలువ డుతున్న విషవాయువుతో స్థానికులు అవస్థలు వర్ణతీతంగా ఉన్నాయన్నారు. ఇలాంటి సంఘట నలు తరచూ జరుగుతూనే ఉన్నాయన్నారు. దీని వలన స్థానికులు అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. ప్రజాప్రతినిధులకు ఈ విషయం తెలిసినా.. డంపింగ్‌ యార్డు తర లింపుపై చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైన యార్డు తరలింపు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జిలాన, కేశవ రాయల్‌, రామాంజి, అనిల్‌, ఇమ్రాన, వీరేంద్ర, రామాంజినేయులు, చంద్రశేఖర్‌, రాజీవ్‌కాలనీ వాసులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 11:45 PM