మినీమేనిఫెస్టోతో అన్ని వర్గాలకు లబ్ధి
ABN , Publish Date - Mar 16 , 2024 | 12:19 AM
కదిరి, మార్చి 15: చంద్రబాబు ప్రకటించిన మినీమేనిఫెస్టో పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని కదిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందికుంట యశోదాదేవి తెలిపారు.
![మినీమేనిఫెస్టోతో అన్ని వర్గాలకు లబ్ధి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
-ఇంటింటి ప్రచారంలో కందికుంట యశోదాదేవి
కదిరి, మార్చి 15: చంద్రబాబు ప్రకటించిన మినీమేనిఫెస్టో పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని కదిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందికుంట యశోదాదేవి తెలిపారు. పట్టణంలోని కుటాగుళ్ల 36వ వార్డులో శుక్రవారం ఆమె ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు కరపత్రాలు పంచుతూ మినీమేనిఫెస్టో గురించి వివరించారు. ఈ పథకాల వల్ల అన్నివర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబును సీఎం చేసుకుందామని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.