Share News

వైసీపీని వీడి టీడీపీలోకి పలువురి చేరిక

ABN , Publish Date - Mar 09 , 2024 | 11:54 PM

అధికార పార్టీ వైసీపీకి సంబంధించి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే వలసపక్షుల తీరునచ్చక టీడీపీలో చే రామని పరిగి మండలం శ్రీరంగరాజుపల్లి, పాపిరెడ్డిపల్లికి చెందిన కుటుంబా ల వారు పేర్కొన్నారు.

వైసీపీని వీడి టీడీపీలోకి పలువురి చేరిక
టీడీపీలో చేరిన వారితో సవిత

పెనుకొండ టౌన, మార్చి 9 : అధికార పార్టీ వైసీపీకి సంబంధించి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే వలసపక్షుల తీరునచ్చక టీడీపీలో చే రామని పరిగి మండలం శ్రీరంగరాజుపల్లి, పాపిరెడ్డిపల్లికి చెందిన కుటుంబా ల వారు పేర్కొన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ సవిత వైసీపీకి చందిన 13 కుటుంబాల వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి సవిత పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీ లో చేరివావారు మాట్లాడుతూ... టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి సవిత చేస్తున్న సేవా కార్యక్రమాలు, ఆమె మంచితనం నచ్చి వైసీపీ వీడి టీడీపీలోకి వచ్చామన్నారు. సవిత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో నాయకు లు, కార్యకర్తలు ఒక కుటుంబంలోని అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటారని... ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. మరో రెండు రోజుల్లో నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేపడుతామని ఆమె తెలిపారు. ఇప్పటికే వైసీపీ నాయకుల తీరు నచ్చక టీడీపీలోకి వలసలు వస్తున్నారని తెలిపారు. వారందరికీ ప్రాధాన్యమిస్తామని, ఏ ఒక్కరికి అన్యా యం చేయమని ఆమె వాగ్దానం చేశారు. ఈ కార్యకక్రమంలో టీడీపీ నాయకు లు మాజీ ఎంపీపీ సూర్యనారాయణ, బీచిగానిపల్లి సర్పంచ బాలాజీ, శాసన కోట వెంకటేశ, శీన, తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారు భాస్కర్‌, మారుతి, సురేష్‌, వెంకటేశ, సోమన్న, జీ వెంకటేశ, గంగప్ప, శ్రీరాములు, గణేష్‌, నవీన, సిద్దప్ప, రామాంజనేయులు తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 09 , 2024 | 11:54 PM