Share News

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:37 PM

మండలంలోని మేడాపురంలో తలారి రమేశ (40) విద్యుదాఘాతానికి గురై సోమవారం మరణించాడు. ఉదయం ఇంటివద్ద వైర్‌పై బట్టలు ఆరవేస్తుండగా.. స్టే వైర్‌ ద్వారా విద్యుత సరఫరా కావడంతో ఈ ప్రమాదం జరిగింది

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

చెన్నేకొత్తపల్లి, జనవరి 1: మండలంలోని మేడాపురంలో తలారి రమేశ (40) విద్యుదాఘాతానికి గురై సోమవారం మరణించాడు. ఉదయం ఇంటివద్ద వైర్‌పై బట్టలు ఆరవేస్తుండగా.. స్టే వైర్‌ ద్వారా విద్యుత సరఫరా కావడంతో ఈ ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో ఒక్కసారి కుప్పకూలిన అతన్ని కుటుంబసభ్యులు వెళ్లి పరిశీలించగా.. అతను అప్పటికే మరణించినట్లు గుర్తించారు. తలారి రమేశ భార్య రామాంజినమ్మ మేడాపురం ఎంపీటీసీ-2. వీరికి ఒక కుమార్తె. మృతదేహాన్ని పోలీసులు ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

రూ.లక్ష ఆర్థిక సాయం: తలారి రమేశ మృతి విషయం తెలుసుకున్న కనగానపల్లి మండలం రాంపురం గ్రామానికి చెందిన ప్రొఫెసర్‌ రాజేశ మేడాపురం గ్రామానికి చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. రామాంజినమ్మకు రూ.లక్ష చెక్కును అందజేశారు.

Updated Date - Jan 01 , 2024 | 11:37 PM