Share News

యువచైతన్యయాత్రను విజయవంతం చేయండి

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:24 PM

మండలంలో ఫిబ్రవరి 1నుంచి నిర్వహించే యువచైతన్య బస్సుయాత్రను విజయవంతం చేయాలని తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

యువచైతన్యయాత్రను విజయవంతం చేయండి

యాడికి, జనవరి 30: మండలంలో ఫిబ్రవరి 1నుంచి నిర్వహించే యువచైతన్య బస్సుయాత్రను విజయవంతం చేయాలని తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాయలచెరువు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ టీడీపీకి విశేష ఆదరణ వస్తోందన్నారు. పెద్దవడుగూరు మండలంలో నిర్వహించిన బస్సుయాత్రనే ఇందుకు నిదర్శనమన్నారు. సైకో పాలనలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా అటకెక్కిందని తెలిపారు. ప్రజల ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడానికి తాను బస్సుయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంత రం బస్సుయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు. సమావేశంలో నాయకులు చవ్వా గోపాల్‌రెడ్డి, వేలూరు రంగయ్య, పరిమి చరణ్‌, గోపాల్‌నాయుడు, మాదాల అనిల్‌, శ్యాంసుందర్‌ నాయుడు, రవికుమార్‌రెడ్డి, నరసింహులు, బొట్టు శేఖర్‌, విజయ్‌, శ్రీనివాసులు, లక్ష్మణ్‌, మోపిరెడ్డి, రాజారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 11:24 PM