జీవిత ఖైదు
ABN , Publish Date - Apr 08 , 2024 | 11:33 PM
పట్టణంలోని నందలపాడుకు చెందిన కాసి పోగుల వెంకటేశ్వర్లుకు అనంతపురం కోర్టు జీవిత ఖైదుతోపాటు రూ.2500 జరిమానా విధించినట్లు సోమవారం పోలీసులు తెలిపారు.
![జీవిత ఖైదు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
తాడిపత్రిటౌన, ఏప్రిల్8: పట్టణంలోని నందలపాడుకు చెందిన కాసి పోగుల వెంకటేశ్వర్లుకు అనంతపురం కోర్టు జీవిత ఖైదుతోపాటు రూ.2500 జరిమానా విధించినట్లు సోమవారం పోలీసులు తెలిపారు. నందలపాడులో నివాసం ఉంటున్న కాసిపోగుల వెంకటేశ్వర్లు మద్యం మత్తులో 2020 జూలై 4న ఓ బాలికపై అత్యాచారం చేశాడని కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన కోర్టు, నేరం రుజువు కావడంతో ముద్దాయికి జీవితఖైదు విధించిందని పోలీసులు తెలిపారు.