Share News

కలిసి పనిచేద్దాం.. విజయం సాధిద్దాం

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:22 PM

అందరం కలిసికట్టుగా పనిచేసి ఎన్నికల్లో విజయాన్ని సాధించి... పార్టీ అధినేత చంద్రబాబుకు కానుక గా ఇద్దామని అనంత అర్బన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొ న్నారు.

కలిసి పనిచేద్దాం.. విజయం సాధిద్దాం
ప్రచారంలో గజమాలతో దగ్గుపాటిని సన్మానిస్తున్న అభిమానులు

అనంతపురం అర్బన, ఏప్రిల్‌ 16: అందరం కలిసికట్టుగా పనిచేసి ఎన్నికల్లో విజయాన్ని సాధించి... పార్టీ అధినేత చంద్రబాబుకు కానుక గా ఇద్దామని అనంత అర్బన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొ న్నారు. మంగళవారం స్థానిక ఎంవైఆర్‌ ఫంక్షన హాల్‌లో నిర్వహించిన అనంత అర్బన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో దౌర్జన్యాలు, రౌడీయిజం చేసేందుకు వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారని, వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు మనం కూడా సిద్ధంగా కావాలన్నారు. ఐదేళ్లపాటు అనంత అర్బనలో పార్టీ కోసం నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి ఐదేళ్లు కష్టపడ్డారని, ఆయన అంతగా కష్టపడ్డారు కాబట్టే ఈ ఎన్నికల్లో తన గెలుపు నల్లేరు మీద నడకలా మారిందని అన్నారు. పార్టీ అధిష్టానం ఆయన సేవలు గురించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించిందని గుర్తుచేశారు. ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... ఏ బూ త పరిధిలో ఎక్కువ మెజార్టీ వస్తే ఆయా ఇన చార్జిలకు మంచి పదవులు ఉంటాయన్నారు. ఎ క్కడ వైసీపీ నాయకులు బెదిరింపులు, దౌర్జన్యా లకు దిగిన తక్షణమే తమ దృష్టికి తీసుకురా వాలన్నారు. అర్బన పరిశీలకులు రమణారెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో అరాచక పాలన సా గుతోందని, టీడీపీ అభ్యర్థుల గెలుపు ప్రజలకు ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్‌ స్వరూప, నాయకులు డిష్‌ నాగరాజు, సరిపూటి రమణ, దేవళ్ల మురళి, మారుతీ కుమార్‌ గౌడ్‌, స్వామిదాస్‌, ముక్తియార్‌, గోపాల్‌ గౌడ్‌, పీఎం లక్ష్మీప్రసాద్‌, నెట్టెం బాలకృష్ణ, సైఫు ద్దీన, లింగారెడ్డి, గుర్రం నాగభూషణం, రాజా రావు, మార్కెట్‌ మహేష్‌, బాలప్ప, వన్నూరు, తెలుగు మహిళలు స్వప్న, విజయశ్రీరెడ్డి, విశాలాక్షి, బల్లా పల్లవి, సరోజమ్మ, సంగా తేజస్విని, జనసేన నాయకులు కాయగూరల లక్ష్మీపతి, పెండ్యాల శ్రీలతల, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 11:22 PM