వైసీపీ పాలనకు చరమగీతం పాడుదాం
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:20 AM
ధర్మవరం, ఫిబ్రవరి 5: అవినీతి వైసీపీ పాలనకు ఇక చరమగీతం పాడదామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య, పట్టణ అధ్యక్షుడు పరిశే సుధాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
- భవిష్యత్తుకు గ్యారెంటీలో టీడీపీ నాయకుల పిలుపు
ధర్మవరం, ఫిబ్రవరి 5: అవినీతి వైసీపీ పాలనకు ఇక చరమగీతం పాడదామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య, పట్టణ అధ్యక్షుడు పరిశే సుధాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. పట్టణంలోని 40వ వార్డులో గల గుట్టకిందపల్లిలో సోమవారం వారు టీడీపీ పట్టణ ప్రచార కమిటీ ఆధ్వర్యంలో బాబుష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి ప్రజలకు కరపత్రాలు పంచుతూ చంద్రబాబు ప్రకటించిన మినీమేనిఫెస్టో పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం మాట్లాడుతూ.. వైసీపీ అఽధికారం చేపట్టి ఐదేళ్లు గడుస్తున్నా.. ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. గుంతలు పడ్డ రోడ్లను కూడా బాగు చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ పాలనకు చరమగీతం పాడి.. టీడీపీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు భీమనేని ప్రసాద్నాయుడు, రాళ్లపల్లిషరీఫ్, అశోక్, మాధవరెడ్డి, గోసలశ్రీరాములు, కరెంటు ఆది, జిలకరశీన, మారుతీస్వామి, కొత్తపేట ఆది, బడిగింజల రమణ, అత్తర్ రహీంబాషా, పల్లపు రవీంద్ర, బీరే శీన తదితరులు పాల్గొన్నారు.