Share News

రాక్షస పాలనకు చరమగీతం పాడాలి

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:29 AM

వచ్చే ఎన్నికల్లో జగన రాక్షస పాలనకు చంద్రబాబు చరమగీతం పాడుతారని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి జితేంద్రగౌడ్‌ పేర్కొన్నారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాక్షస పాలనకు చరమగీతం పాడాలి

గుంతకల్లుటౌన, జనవరి 7: వచ్చే ఎన్నికల్లో జగన రాక్షస పాలనకు చంద్రబాబు చరమగీతం పాడుతారని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి జితేంద్రగౌడ్‌ పేర్కొన్నారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు టీడీపీ పిలుస్తోంది రా కదిలిరా అన్న ఎన్టీఆర్‌ పిలుపునకు ప్రభంజనంలా కదిలి వచ్చినట్లుగానే ప్రస్తుతం టీడీపీ, జనసేన ఇస్తున్న రా కదిలిరా పిలుపునకు అంతకు మించి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు రావాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో జగనను శాశ్వతంగా రాజకీయాల్లో లేకుండా చేయాలన్నారు. జగన రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చాడన్నారు. సంక్షేమం పేరుతో జగన రూ. 10 ప్రజలకు ఇచ్చి వారి నుంచి రూ, 100 దోచుకుంటున్నాడన్నారు. ఒక్కచాన్స పేరుతో అదికారం లోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. రా కదిలిరా పేరుతో చేపట్టిన ఎన్నికల శంఖారావ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాల న్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు తలారి మస్తానప్ప, టీ కేశప్ప, ముక్కన్నగారి రామాంజినేయులు, శివన్న, న్యాయవాది హేమాద్రి, బీ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 12:29 AM